యాదగిరిగుట్ట, మే 16: మతతత్వాన్ని రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ తీరును ఊరూరా ఎండగడుతామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీజేపీ మనువాదాన్ని అమలు చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ఈ నెల 23న భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు దళిత సంఘాలు ఏకం కావాలని, విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న బీజేపీని గద్దె దింపేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.