సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): మైనార్టీల సాధికారతకు సీఎం కేసీఆర్ అవిశ్రాంత కృషిచేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో మైనార్టీ యువతకు మెరుగైన జీవనోపాధిని కల్పించే డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకంలో భాగంగా మంగళవారం నాంపల్లిలోని హజ్ హౌస్ ఆవరణలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఆయన కార్లు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019-2020 ఏడాదిలో ప్రభు త్వం మైనార్టీ నిరుద్యోగుల సంక్షేమం కోసం 300 యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, టీఎస్ఎంఎఫ్సీ ఎండీ కాంతివెలస్లీ పాల్గొన్నారు.