హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పర్యాటకశాఖకు బకాయిలు చెల్లించని లీజుదారుల సంస్థలను తక్షణమే జప్తుచేసి, వాటిని పర్యాటకశాఖ అధ్వర్యంలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. పర్యాటకశాఖకు లీజుదారుల నుంచి రావాల్సిన వాస్తవ బకాయిలపై నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో కొనసాగుతున్న పర్యాటక ప్రాజెక్టుల బకాయిలపై శుక్రవారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
పర్యాటకశాఖకు చెల్లించాల్సిన రూ.234 కోట్ల బకాయిలపై వచ్చిన కథనాలపై చర్చించారు. పర్యాటకశాఖకు పీపీపీ ప్రాజెక్టుల నుంచి రూ.41.88 కోట్లు మాత్రమే రావాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. రూ.15 కోట్లు బకాయి ఉన్న స్నో వరల్డ్ను సీజ్ చేశామని చెప్పారు. జప్తు చేసిన స్నో వరల్డ్ను పర్యాటకశాఖ అధ్వర్యంలో కొనసాగించాలని ్ర ఆదేశించారు. బకాయిలు చెల్లించని సంస్థలను తక్షణమే జప్తు చేసి వాటిని కూడా పర్యాటకశాఖ అధ్వర్యంలో కొనసాగించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. కోర్టుల్లో ఉన్న కేసులపై వెంటనే అడ్వకేట్ జనరల్తో సంప్రదించి వాటిపై కౌంటర్ వేసి బకాయిలు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ నెల 27న ఘనంగా నిర్వహించాలని శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్న కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. అద్భుతమైన పనితీరును ప్రదర్శించిన సంస్థలకు ప్రోత్సాహకంగా పురసారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో పర్యాటకశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టూరిజంశాఖ సంయుక్త కార్యదర్శి రమేశ్, టూరిజం ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.