హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పేపర్ -1లో 32.68 శాతం, పేపర్-2లో 49.64 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు www.tstet.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.
టెట్ను గత నెల 12న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్-1 పరీక్షను 3,18,506 (90.62 శాతం), పేపర్-2 పరీక్షను 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాశారు.