హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : టీఎస్ పాలిసెట్ ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల చేస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. బుధవారం పాలిసెట్ పరీక్ష సజావుగా ముగిసిందని వెల్లడించారు. రాష్ట్రంలోని 296 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పాలిసెట్ ద్వారా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలుంటాయని వివరించారు.