హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరగనుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల విధివిధానాలను వెల్లడించనున్నారు.