TS LAWCET | హైదరాబాద్ : ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీలాసెట్ నోటిఫికేషన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ వెల్లడించారు.
మార్చి 1 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 15. ఆలస్య రుసుంతో మే 25 వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు. ఇక జూన్ 3వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఐదేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.