హైదరాబాద్ : న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తయినట్లు లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఈ నెల 21న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. లాసెట్(3 ఏండ్లు) ప్రవేశ పరీక్ష 21వ తేదీన రెండు సెషన్లలో, లాసెట్(5 ఏండ్లు), పీజీఎల్ సెట్ ప్రవేశపరీక్ష 22న ఒకే సెషన్లో నిర్వహించనున్నారు. మూడేండ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 24,938 మంది, ఐదేండ్ల ఎల్ఎల్బీకి 7,507, ఎల్ఎల్ఎంకు 3,093 మంది దరఖాస్తు చేసుకున్నారు.