హైదరాబాద్ : టీఎస్ లాసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. తొలి విడుత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ఎల్ఎల్బీ(మూడేండ్లు), ఎల్ఎల్బీ(ఐదేండ్ల), ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 3,181 సీట్లు ఖాళీ ఉండగా, 8,987 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో 2,836 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
తుది విడుతలో సీట్లు పొందిన అభ్యర్థులు.. జాయినింగ్ లెటర్, చలాన్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. చలాన్లో వచ్చిన ఫీజును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో చెల్లించాలని తెలిపారు. అనంతరం జాయినింగ్ సర్టిఫికెట్, ఫీజు చెల్లించిన చలాన్తో సంబంధిత కాలేజీలో డిసెంబర్ 16 నుంచి 21వ తేదీ మధ్యలో రిపోర్టు చేయాలని సూచించారు.