TS ICET | హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఫస్ట్ ఫేజ్లో 88.74 శాతం సీట్లు నిండాయి. 100 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండినట్లు ఐసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఎంబీఏ కోర్సులకు సంబంధించి 255 కాలేజీల్లో 20,985 సీట్లు నిండగా, 3044 సీట్లు మిగిలి ఉన్నాయి. అంటే 87.33 శాతం సీట్లు నిండాయి. ఎంసీఏ కోర్సులకు సంబంధించి మొత్తం 46 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండినట్లు పేర్కొన్నారు. ఒక్క సీటు కూడా మిగల్లేదు.
ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 20వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 29, 30వ తేదీల్లో అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఒరిజినల్ టీసీ, జిరాక్స్ సర్టిఫికెట్లను ఆయా కాలేజీల్లో సమర్పించాలి. లేని యెడల సీటు క్యాన్సిల్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.