TS ICET | హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఐసెట్ ఫలితాలను జూన్ 20వ తేదీన విడుదల చేస్తాని కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ వెల్లడించారు. 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో పరీక్షలను నిర్వహించగా 75,925 మంది విద్యార్థులకు గానూ 70,900 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షల ప్రాథమిక కీని జూన్ 5న విడుదల చేస్తామని, జూన్ 6, 8 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించి జూన్ 20న ఫలితాలు విడుదల చేస్తామని విజయలక్ష్మీ తెలిపారు.