హైదరాబాద్ : కరోనా నియంత్రణకు రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రాష్ర్టంలోని అందరికీ టీకా ఇవ్వాలనే ఉద్దేశంతో.. కొవిడ్ -19 వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ప్రభుత్వం షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను ప్రభుత్వం సేకరించనుంది. ఆన్లైన్ ద్వారా బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీ. 6 నెలల్లో 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సప్లయర్ నెలకు 1.5 మిలియన్ డోసులను విధిగా సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ర్టంలో మొత్తం 4 కోట్ల మందికి వ్యాక్సిన్ను ఇవ్వాలని ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.