TS ECET | హైదరాబాద్ : టీఎస్ ఈసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. టీఎస్ ఈసెట్ ఫలితాల్లో 93.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.
పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్లో ర్యాంకుల ఆధారంగా బీటెక్ కోర్సుల్లో ల్యాటరల్ ఎంట్రీ (రెండో సంవత్సరంలో) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన టీఎస్ ఈసెట్కు 22,454 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.