TS EAPCET | హైదరాబాద్ : ఈ నెల 21న టీఎస్ ఎప్సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరగనుంది. 21న నోటిఫికేషన్ విడుదల చేసి, 26 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 6. మే 9వ తేదీ నుంచి 12 వరకు ఆన్లైన్లో ఎప్సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ ఎప్సెట్ను జేఎన్టీయూ నిర్వహించనుంది.