హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు అదుపులో ఉండటంతో 18, 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1,72,241 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షలకు 108 కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. మూడు రోజులపాటు ఆరు సెషన్లల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13న జరగాల్సిన ఈసెట్తోపాటు 14, 15 తేదీల్లో జరగాల్సిన అగ్రికల్చర్, మెడిల్ పరీక్షలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.
విద్యార్థులు పాటించాల్సిన సూచనలు