ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అదే రోజు బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది.