హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చమురు దోపిడీకి నిరసనగా ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాలో ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో మోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) పిలుపునిచ్చింది. తెలంగాణభవన్లో ఆదివారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 714ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్చేశారు. సమావేశంలో టీఆర్ఎస్కేవీ ప్రధాన కార్యదర్శి నారాయణ, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు నాయకులు కృష్ణ, సైదులు, పాండునాయక్, రమేశ్, శ్రావణ్కుమార్, శంకర్లాల్ తదితరులు పాల్గొన్నారు.