హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సుశీ ఇన్ఫ్రా నుంచి నిధుల మళ్లింపు వ్యవహారంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందినట్టు సీఈసీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ పంపింది. రాజగోపాల్ తన కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా నుంచి మునుగోడు నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నేతలు, సానుభూతిపరుల సంస్థల ఖాతాల్లో 5.24 కోట్లు మూడు రోజుల్లోనే జమ చేశారని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ నిధులను మళ్లించారని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్కు సీఈసీ క్లీన్చిట్ ఇవ్వడంపై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆధారాలు ఇచ్చినా ఈసీ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే క్లీన్చిట్ ఇవ్వ డం అనేక సందేహాలకు తావిస్తున్నదన్నారు. ఈ వ్యవహారం లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నేతలతో చర్చిం చి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు.