హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఎస్సీల హక్కుల సాధనకు అండగా ఉంటామని టీఆర్ఎస్ లోక్సభపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు 12 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచారకార్యదర్శి గద్దల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో ఎంపీ నామాను కలిసి వినతిపత్రం అందజేశారు. జేఏసీ నేతలు వివరించిన సమస్యలపై నామా సానుకూలంగా స్పందించారు. దళితుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని చెప్పారు. గతంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.