సమచార సమర్పణకు కార్మికశాఖ నిర్ణయం
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : వివిధ రకాల పరిశ్రమల యాజమాన్యాలు సమర్పించాల్సిన వివిధ రకాల సమాచారాన్ని పంపించడానికి జూన్ చివరివరకు పొడిగిస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు గురువారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో గడువును పొడగించినట్టు తెలిపారు. ఈవోడీబీ అమల్లో భాగంగా కార్మికశాఖ పరిశ్రమలకు అనేకరకాల వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో 14 రకాల నివేదికలకు సంబంధించిన వన్ టైం నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా గడువును పొగడించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.