హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా సిడ్నీలో స్ట్రాత్ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరేతో టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మహేశ్ బిగాల సమావేశమయ్యారు. తెలంగాణలో ఐటీ విస్తరణ, ఇతర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతిని మేయర్కు వివరించారు. ఎనిమిదేండ్లలో దేశ, విదేశాల నుంచి తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, ప్రఖ్యాత కంపెనీలు తమ గమ్యస్థానంగా హైదరాబాద్ను ఎంచుకున్న తీరును వెల్లడించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలో నెలకొల్పే విషయంపై చర్చించారు. స్ట్రాత్ఫీల్డ్ 16 శాతం మంది భారతీయులు ఉన్నారని, ఇందులో తెలుగు వారు ఎకువగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ బిడ్డ సంధ్యారెడ్డి తొలిసారి కౌన్సిల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించటం తెలంగాణవాసులకు గర్వకారణమని పేర్కొన్నారు. పీవీ విగ్రహ ఏర్పాటుపై కౌన్సిల్లో చర్చిస్తామని మాథ్యూ హామీ ఇచ్చారని మహేశ్ బిగాల తెలిపారు. సమావేశంలో స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిల్ కౌన్సిలర్ సంధ్యారెడ్డి, స్ట్రాత్ఫీల్డ్ ఇండిపెండెంట్స్ ప్రెసిడెంట్ కర్రీ బూచిరెడ్డి, ఉపేందర్ గాదె పాల్గొన్నారు.