న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. వెల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు లోక్సభ సెక్రటరీ జనరల్కు ఆ నోటీసులు అందజేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో వెల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో లోక్సభ ఎంపీలు ఆందోళన నిర్వహించారు.
ఇవాళ ఉదయం రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తెలంగాణ ఎంపీలు సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. అయితే ప్రివిలేజ్ నోటీసుపై చైర్మెన్ నిర్ణయం తీసుకుంటారని డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తెలిపారు.