న్యూఢిల్లీ : పార్లమెంట్లో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఏడుగురు, లోక్సభ ఎంపీలు 9 మంది కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను వెల్లడించనున్నారు.
పార్లమెంట్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు.. pic.twitter.com/WYpbqNngVJ
— Namasthe Telangana (@ntdailyonline) July 18, 2022