వరంగల్ డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రైతులకు రూ.15 వేల ఆర్థిక సహాయం, గిట్టుబాటు ధర అని చెప్పిన హామీలను ముందు కాంగ్రె స్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చేతనైతే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 24 గంటల కరెంటు ఇవ్వాలని నిలదీశారు. టీఆర్ఎస్ది రైతు ప్రభుత్వమని, రైతును రాజు చేసే ప్రభుత్వమని ఈ దేశమే గుర్తించిందని, అందుకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజనే నిదర్శనమని వెల్లడించారు. కాంగ్రెస్ పదేండ్ల పాటు చేసిన పాపాలను టీఆర్ఎస్ కడిగేస్తున్నదని పేర్కొన్నారు.