టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్నారు. స్వామివారి నిజపాద సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకొన్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకొన్న కవిత దంపతులకు అధికారులు సాదర స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం వారిని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి పట్టు వస్ర్తాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత కుటుంబసమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. వారి వెంట ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఉన్నారు.