హైదరాబాద్ : టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా యావత్ ప్రజానీకం సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన, ఓటేసిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ ప్రముఖులకు,నాయకులకు, శ్రేణులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారికి శుభాకాంక్షలు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.