Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీకి 45,723 ఓట్లు పోలవగా, బీజేపీకి 43,155, కాంగ్రెస్ పార్టీకి 13,689 ఓట్లు వచ్చాయి. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2568 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్లో కారు గుర్తుకు 7202 ఓట్లు, బీజేపీకి 6803, కాగ్రెస్కు 1664 చొప్పున ఓట్లు పోలయ్యాయి.
ఆరోరౌండ్లో టీఆర్ఎస్ 6016 ఓట్లు సాధించగా, బీజేపీ 5378, కాంగ్రెస్ పార్టీకి 1831 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 8వ రౌండ్ కొనసాగుతున్నది.