నల్లగొండ: మునుగోడులో టీఆర్ఎస్ దూసుకెళ్లున్నది. పోస్టల్ ఓట్లలో నాలుగు ఓట్ల ఆధిక్యంలో నిలిచిన గులాబీ పార్టీ.. మొదటి రౌండ్లో 1352 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్లో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 6478 ఓట్లు పోలవగా, బీజేపీకి 5126, కాంగ్రెస్ పార్టీకి 2100 ఓట్లు వచ్చాయి. దీంతో తన సమీప అభ్యర్థి కంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1356 ఓట్ల ఆధిక్యంలో (పోస్టల్ ఓట్లతో కలిపి) కొనసాగుతున్నారు.