Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే భయంతోనే బీజేపీ కుట్రలకు దిగి, ఆరోపణలు చేస్తుందని టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై టీ న్యూస్ వేదికగా జరిగిన విశ్లేషణలో క్రిశాంక్ మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దీంతో బీజేపీ నాయకులకు భయం పట్టుకుంది. ఓడిపోతున్నామని తెలిసి ఎన్నికల అధికారులను బెదిరిస్తూ, కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల ఏజెంట్లు కూడా ఉంటారు. వారందరిని కాదని ఎన్నికల అధికారులు ఓట్లను తారుమారు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించాల్సిందేనని చెప్పారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఓడినప్పుడు హరీశ్రావు ఓటమిని అంగీకరిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా గౌరవంగా ఉండాల్సింది పోయి.. కుట్రలు చేయడం సరికాదన్నారు క్రిశాంక్.