స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 13: తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. సోమవారం జనగామ జిల్లా చిన్నపెండ్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాని కి బీజేపీ ఏంచేసిందో చెప్పాలని డిమాండ్చేశారు. విజభన చట్టంలోని హామీలను విస్మరించి ఇప్పుడు వారే పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు, దొడ్డు వడ్ల కొనుగోలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటికరణపై సమాధానం చెప్పి హుజూరాబాద్లో ఓట్లు అడగాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయాలని చూస్తుంటే.. కేంద్రం నల్ల చట్టాలతో రైతుల నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు.