వరంగల్, జూలై 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హనుమకొండ, జూలై 28: మేము న్నాం అంటూ అభయం ఇచ్చారు.. అధైర్యపడకండి అంటూ భరోసా కల్పించారు.. ఆకలితో ఉన్న వారి కడుపులు నింపారు.. భయపడకండి.. భారం మాదేనని ఒట్టేసిండ్రు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీతో ఓదార్చిండ్రు.. ఇవి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాం గం వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఇచ్చిన ఓదార్పు దృశ్యాలు. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముంపు ప్రాంతాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, రాజయ్య, చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచవాగు గ్రామస్థులకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి పరామర్శించారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే ఉపేం దర్రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేశ్ గుప్తా, మెదక్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పరిశీలించారు.