హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడు మండలం పలివెలలో తమ నేతలపై దాడి చేయించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిం ది. ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్లపై ఈటల బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడి చేయించారన్నారు. ఈ దాడిలో పల్లా రాజేశ్వర్రెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, జగదీశ్, శ్రీనివాస్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయని, పోలీసులపై కూడా దాడి చేశారన్నారు.