మునుగోడు, అక్టోబర్ 12: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం నల్లేరు మీద నడకేనని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అత్యధిక మెజార్టీతో ఆయనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు మండ లం దుబ్బకాల్వలో మంత్రి మంగళవారం రా త్రి కూసుకుంట్ల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు భారీ ప్రదర్శనతో ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందుతున్నదని చెప్పారు. కేసీఆర్ పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజే పీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని పే ర్కొన్నారు. ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. మునుగోడు ప్రజలను తాకట్టు పెట్టి కాంట్రాక్టులు సా ధించుకొన్న వ్యక్తికి ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.