హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ కాలేజియేట్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ (ఐసీపీసీ)లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్ర తిభ చాటారు. ప్రతి సంవత్సరం 111 దేశాల నుంచి మూడువేల కంటే ఎక్కు వ విశ్వవిద్యాలయాలకు చెందిన 50 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోని ముగ్గురు విద్యార్థులు అమూల్ అగర్వాల్, అలాపన్ చౌదరి, ఆదిత్య వర్మలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐసీపీసీ ఫైనల్లో స్థానం సంపాదించారని ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థ ప్రతినిధి తెలిపారు. ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్ వంటి విద్యాసంస్థల విద్యార్థులతో పోటీపడుతూ ఈ ముగ్గురు సత్తా చాటడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.