తెలుగులో కృతిశెట్టి మరో కొత్త సినిమాను అంగీకరించిందా? బాలీవుడ్ రీమేక్లో ఆమె నటించబోతుందా? అంటే ఔననే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. షాహిద్కపూర్, అమృతరావ్ జంటగా 2006లో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘వివాహ్’. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఓ జంట మధురానుభూతుల్ని దృశ్యమానం చేస్తూ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జాత్యా తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. కుటుంబ బంధాలకు దర్పణంలా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాత బెల్లంకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయికగా కృతిశెట్టిని ఎంపికచేసినట్లు వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ గణేష్బాబు హీరోగా నటించనున్నట్లు సమాచారం. ‘ఉప్పెన’ సక్సెస్ తర్వాత కథానాయికగా బిజీగా మారిన కృతిశెట్టి ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల్లో నటిస్తోంది.