Felicitation MLC Madhu | ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ నాయకుడు తాతా మధుకు శుక్రవారం ఆత్మీయ సన్మానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం (టీఆర్ఎస్కేవీ) రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు సారథ్యంలో పూర్వ విద్యార్థి మిత్రులు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు.
1989 నుంచి 1994 మధ్య విద్యార్థి ఉద్యమంలో హైదరాబాద్ నగరంలో ఆయనతో మమేకమైన వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులంతా తాతా మధుతో తమకు ఉన్న అనుబంధాన్ని, నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.