హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి నాటికి డబుల్బెడ్రూం ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. వచ్చే జనవరి 15 నాటికి ఇండ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల ను త్వరితగతిన లబ్ధిదారులకు అప్పగించేందు కు నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ వేగం పెంచేందుకు కలెక్టర్లు వారం వారం సమీక్ష నిర్వహించాలని దిశానిర్దేశం చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే 2,91,057 ఇండ్లు మం జూరుచేసింది. ఇందుకు రూ.18 వేల కోట్లు కేటాయించింది. కొన్నిచోట్ల ఇప్పటికే లబ్ధిదారులకు ఇండ్లను అందజేయగా, మరికొన్నిచోట్ల నిర్మాణాలు తుది దశకు చేరుకొన్నాయి. ఇండ్ల నిర్మాణంతోపాటు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను వేగంగా కల్పించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ప్ర భుత్వం స్పష్టంచేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి, అద్దె భవనాల్లో నివసిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని సంబంధిత తాసిల్దార్లకు పంపించాలని సూచించింది. తాసిల్దార్లు క్షేత్రస్థాయిలో ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని ఆదేశించింది. కలెక్టర్లకు చేరిన జాబితాను ప్రభుత్వానికి పంపిస్తే.. క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేసేందుకు సులువు అవుతుందని ప్రభుత్వం సూచించింది. నిర్మించిన ఇండ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎకువమంది ఉంటే లక్కీడీప్ ద్వారా ఎంపిక చేయాలని, మిగిలిన వారి జాబితాను వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.