Election Campaigner | గిర్మాజీపేట, సెప్టెంబర్ 20: తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ వరంగల్ నగరంలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోట ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ లైలాను ఎంపిక చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగా.. ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నది. సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు, నటులు, సామాజికవేత్తలను ఎంపిక చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ సారి వరంగల్కు చెందిన ట్రాన్స్జెండర్ లైలాను ప్రచారకర్తగా ఎంపిక చేసినట్టు ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది.