హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తె లంగాణ) : టీచర్ల తరహాలోనే రాష్ట్రంలోని డి గ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు రం గం సిద్ధమవుతున్నది. ఆయా కాలేజీల్లోని అ ధ్యాపకులను బదిలీ చేసేందుకు విద్యాశాఖ క సరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేశారు. ప్రభుత్వం అంగీకరిస్తే ఒకే దఫాలో డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లను బదిలీచేస్తారు. గురువారం ఈ అంశంపై ప్రభుత్వానికి పూర్తి నివేదికను సమర్పించే అవకాశాలున్నాయి. రెండు మూ డు రోజుల్లో పూర్తి షెడ్యూల్, మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ఐదేండ్ల సర్వీసు పూర్తిచేసిన డిగ్రీ లెక్చరర్లను బదిలీచేసేలా మార్గదర్శకాలు రూపొందించినట్టు తెలిసింది. దీంతో కళాశాల విద్యశాఖలో 1,200 మంది వరకు అధ్యాపకులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఇక సాంకేతిక విద్య పరిధిలోని పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు కూడా ప్రతిపాదనలు చేశారు. సాంకేతిక విద్యలోను 5 ఏండ్లుగా అధ్యాపకుల బదిలీలు లేవు. ఈ నేపథ్యంలోనే కొంత మంది లెక్చరర్లు ఇటీవలే మంత్రి సబితను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో మార్గదర్శకాలు, షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో వెయ్యికి పైగా లెక్చరర్లు పనిచేస్తుండగా, ఐదేండ్ల కనీస సర్వీసు పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేయనున్నారు. ఈ లెక్కన 300 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్లు బదిలీ అయ్యే అవకాశం ఉన్నదని అధికారులు అంచనాలేస్తున్నారు.