హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలం గాణ): రెవెన్యూ శాఖలోనూ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. విద్యాశాఖలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా పెండిం గ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ల పదోన్న తులతోపాటు అన్ని క్యాడర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి తాసిల్దార్ క్యాడర్ వరకు పదోన్నతులు కల్పించాలని వారు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసి సర్వీసును క్రమబద్ధీ కరించడంతోపాటు మూడు డీఏ లను విడుల చేయాలని వారు ఆ ప్రకటనలో కోరారు.