హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అటవీశాఖలో పలువురు ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారులకు ప్రమోషన్ కల్పించారు. ఈ మేరకు వారిని బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పీసీపీఎఫ్గా పనిచేస్తున్న లోకేశ్ జైస్వాల్ను వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్గా బదిలీ చేసింది. మరో ఐదుగురిని కూడా ప్రమోషన్పై బదిలీ చేసింది.