ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 6: ఉస్మానియా యూనివర్సిటీకి టీఎస్ ట్రాన్స్కో రూ.1.53 కోట్ల విరాళం అందజేసింది. క్యాంపస్లో బాలికల హాస్టల్ నిర్మించేందుకు రూ.58.10 కోట్లు అవసరమని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలు విరాళం అందజేయాలని ఓయూ అధికారులు ఇటీవల కోరారు.
టీఎస్ ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు సంస్థ తరఫున రూ.1.53 కోట్లు ప్రకటించారు. బుధవారం ఓయూ అధికారులకు చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ పాల్గొన్నారు.