జూబ్లీహిల్స్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ను అమలుచేయడంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2023 మే 17న జాతీయస్థాయిలో ప్రారంభించిన ఈ పోర్టల్ అతి తక్కువ వ్యవధిలో ఇప్పటివరకు 19 వేల మొబైల్ ఫోన్లను పట్టించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రూపొందించిన ఈ పోర్టల్కు సీఐడీ అడిషనల్ డీజీపీ శిఖా గోయెల్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ దిశగా కృషిచేసిన సీఐడీ ఎన్జేపీ ఎస్పీ లావణ్య, ఇన్స్పెక్టర్ సురేశ్బాబు, ఏఎస్ఐ పీ సంజీవరావు, కానిస్టేబుల్ జీ అనురాధకు అప్రిసియేషన్ సర్టిఫికెట్ గుర్తింపు లభించింది.