హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజాసమతి (టీపీఎస్) ఖతార్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా భూమయ్య గద్దె (శ్రీనివాస్), ఉపాధ్యక్షుడిగా సురేందర్ నామాల, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్ పొట్ట, సంయుక్త ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్రెడ్డి పడకంటి, కోశాధికారిగా వేణుప్రసాద్ వెల్దండి, సాంస్కృతిక కార్యదర్శిగా ధర్మరాజు పంచిత, సాంస్కృతిక సంయుక్త కార్యదర్శిగా శృతి ఉపేందర్, మెంబర్షిప్, మీడియా సెక్రటరీగా అబ్దుల్ మతిన్, అసోసియేట్ మెంబర్షిప్ సెక్రటరీగా రమేశ్ దొనకంటి, లాజిస్టిక్ సెక్రటరీగా శ్రీనివాస్ ఏదుల, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా లక్ష్మణ్ మందా ఎన్నికయ్యారు. ఐసీసీ, దాని అనుబంధ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో టీపీఎస్ ఖతార్శాఖ తోడుగా ఉంటుందని కమిటీ నూతన అధ్యక్షుడు తెలిపారు.