బెల్లంపల్లి, జూన్ 4 : మా వోయిస్ట్ పార్టీ అగ్రనేత, పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ (69) ఇకలేరు. మావోయిస్ట్ ఉ ద్యమంలో కీలకపాత్ర పో షించిన ఆయన్ను కొంతకాలంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. గత నెల 31న గుండెపోటుతో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆదివారం ప్రకటించింది.
దండకారణ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించినట్టు వెల్లడించింది. సుదర్శన్ 40 ఏండ్లపాటు అజ్ఞాతంలో ఉండి ఏ ఒక్కరోజు కూడా తన ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. తల్లిదండ్రులు మృ తి చెందినా రాలేదు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు చూసి కుటుంబ సభ్యులు, బస్తీవాసులు, చిన్ననాటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.