నాంపల్లి, ఫిబ్రవరి 1, (నమస్తే తెలంగాణ): తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన పలు డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. చార్జిషీట్లు దాఖలు చేసిన ఆరు కేసుల్లో తగి న సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నది. డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధాలున్నాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది.
వివిధ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లల్లో మొత్తం 12 కేసులు నమోదు కాగా వాటిలో ఆరింటిని కోర్టులు కొట్టేశాయి. డ్రగ్స్ కేసులో అనుసరించాల్సిన నిబంధనలను అమలుచేయలేదని కో ర్టు తప్పుపట్టింది. 2017లో సినీ ప్రముఖులు పలువురు దర్యాప్తునకు హాజరుకావడంతో ఈ కేసు పెను సంచలనం రేపింది. నటీనటులు, దర్శకులు, ఇతర సినీ రంగానికి చెందిన వాళ్ల గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. వాటి నమూనాల పరిశీలన తర్వాత వాళ్ల శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలడంతో ఆరు కేసుల్ని కోర్టు కొట్టేసింది.