హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న సినీనటుడు మంచు మోహన్బాబు మరో కీలక ప్రకటన చేశారు. ‘మోహన్బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)’ని ప్రారంభిస్తున్నట్టు గురువారం ట్విట్టర్లో ప్రకటించారు. ‘1993లో శ్రీవిద్యానికేతన్ సంస్థలను ప్రారంభించాను. ఆ తర్వాత విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, ఫార్మసీ, పీజీ కాలేజీ ఏర్పాటు చేశాను. ఇప్పుడు మోహన్బాబు యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.