జనగామ, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇంటి ముందు ఆడుకుంటూ నీటి సంప్లో పడి చిన్నారి విగతజీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో మృత్యువాత పడింది. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్నది. సంజయ్నగర్కు చెందిన సుద్దాపెల్లి రఘువంశీ-సరిత దంపతుల కుమార్తె ప్రియాన్షి (2) ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంప్లో పడి మృతి చెందింది.
ఆ సమయంలో తండ్రి ఇంట్లోనే నిద్రిస్తుండగా తల్లి పనిలో ఉండగా, ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంట్లో బిడ్డ కనిపించడంలేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతికితే సంప్లో శవమై కనిపించింది. మనుమరాలు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక నాయనమ్మ నాగమ్మ రోదిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది.