హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం బుధవారం సాయంత్రం 4.30 గంటల నుంచి ‘ఉగాది శోభ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నది. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 22 మంది యువ కవిసమ్మేళనం, నామ సంకీర్తన భక్తిగీతాలు, ప్రముఖుల ఉగాది సందేశాలు ఉంటాయి. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు రమణాచారి, ప్రత్యేక అతిథిగా తెలుగు వేదకవి జొన్నవిత్తుల, గౌరవ అతిథిగా వీఎస్ఆర్ మూర్తి హాజరు కానున్నారు. ఎఫ్ఎం రెయిన్బో 101.9లో, ఎయిర్ హైదరాబాద్ యూట్యూబ్ చానల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.