ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 28: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ సీపీజీఈటీ సీట్ల కేటాయింపు తొలి జాబితా శుక్రవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. 45 వేల సీట్లుండగా, 33 వేల మంది వెబ్ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు 4లోపు కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.